Breaking News

12/07/2019

రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌

అమరావతి, జూలై 12 (way2newstv.in)
మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బడ్జెట్‌ ప్రసంగాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఇవీ...మొత్తం బడ్జెట్ : రూ.2లక్షల 27 వేల 974 కోట్లు. రెవెన్యూ లోటు-రూ.1,778.52 కోట్లు, బడ్జెట్ అంచనా-19.32శాతం పెరుగుదల. రెవెన్యూ వ్యయం-20.10శాతం పెరుగుతందని అంచనా కేటాయింపుల్లో దేనికెంత..!? రాజధాని అమరావతికి రూ.500 కోట్లువిద్యుత్‌ కొనుగోళ్లు ఒప్పందం కోసం అదనంగా రూ.2 వేల కోట్లు చెల్లిస్తోంది. ఇంధన రంగంలో గత ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్లు రుణంగా వచ్చింది. 
రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌

సాగునీటి శాఖకు 13,139 కోట్లు, వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు 8750 కోట్లు, అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్లు, ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు, వైఎస్‌ఆర్‌ 9గంటల ఉచిత విద్యుత్‌కు 4525 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు, విపత్తుల నిర్వహణకు రూ.2,002 కోట్లు, ఫసల్‌ బీయా యోజనకు రూ.1163 కోట్లు, ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీ రూ.475 కోట్లు, వైఎస్‌ బోర్‌ వెల్‌పథకానికి రూ.200 కోట్లు, విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు, అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు, స్కూళ్లలో మౌలికవసతులకు రూ.1500 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.1077 కోట్లు, వైఎస్‌ఆర్‌ స్కూల్‌ మెయింటనెన్స్‌ గ్రాంట్‌ రూ.160 కోట్లు, ఆరోగ్యశ్రీ రూ.1740 కోట్లు, ఆస్పత్రుల్లో మౌలికవసతులకు రూ.1500 కోట్లు, ఆశావర్కర్ల గౌరవవేతనం 456 కోట్లు, వైఎస్‌ఆర్‌ ట్రైబల్‌ మెడికల్‌ కాలేజి- రూ.66 కోట్లు, గురజాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు, విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు, శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పతికి 50 కోట్లువైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ 5వేల కోట్లు, పట్టణాల్లో ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.1370 కోట్లు, బలహీనవర్గాల ఇళ్లకు రూ.1280 కోట్లు, వైఎస్‌ఆర్‌ అర్భన్‌ హౌసింగ్‌కు వెయ్యి కోట్లు

No comments:

Post a Comment