పురపాలక ఎన్నికలలో టిఆర్ఎస్ విజయఢంకా
వనపర్తి జనవరి 25 (way2newstv.in)
పురపాలక ఎన్నికలలో వివిధ పార్టీల అభ్యర్థులు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ప్రచారాన్ని కొనసాగించిన కూడా టిఆర్ఎస్ పార్టీ అవన్నీ కూడా చిత్తుచేసి విజయఢంకా మోగించింది.జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలో పెబ్బేర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా అందులో టిఆర్ఎస్ 7 స్థానాలను,కాంగ్రెస్ 4 ,బిజెపి 1 ,కొత్తకోట మున్సిపాలిటీ లో 15 వార్డులు ఉండగా అందులో టి టి ఆర్ ఎస్ 10,కాంగ్రెస్ 1 ,బిజెపి4, స్థానాలను కైవసం చేసుకున్నాయి.
వ్యూహాలు ప్రతి వ్యూహాలు.ఫలించిన టిఆర్ఎస్ వ్యూహం
అమరచింత మున్సిపాలిటీ లో పది వార్డులు ఉండగా అందులో టిఆర్ఎస్ 3, టిడిపి 1 ,సిపిఐ 1 ,కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 1, బిజెపి 1, సిపిఎం 2, వార్డులను గెలుచుకున్నాయి.వనపర్తి మున్సిపాలిటీ లో 33 వార్డులు ఉండగా అందులో టిఆర్ఎస్ 21. కాంగ్రెస్ 5.. బిజెపి 2. టిడిపి 1. ఇండిపెండెంట్ 4 స్థానాలను గెలుచుకున్నాయి .
No comments:
Post a Comment