Breaking News

31/01/2020

బియ్యం నాణ్యతపై సీఎం సమీక్ష

అమరావతి జనవరి 31  (way2newstv.in)
పౌరసరఫరాలశాఖపై సీఎం  వైయస్ జగన్మోహన్ రెడ్డి  శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తనక్యాంపు కార్యాలయంలో జరిపిన ఈ భేటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని), ఇతర సీనియర్ అధికారులు హాజరు అయ్యారు.ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీని అన్నిజిల్లాల్లో అమలు చేయడంపై సీఎం ఆరా తీసారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన బియ్యం, నిల్వలపై అధికారులు వివరాలు అందించారు. నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరం కాగా, ఖరీఫ్లో, రబీలో పంట ద్వారా 28.74 లక్షల టన్నులు అందుబాటులో ఉందని తెలిపిన అధికారులు, వివిధ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను సీఎంకు చూపించారు.  
బియ్యం నాణ్యతపై సీఎం సమీక్ష

శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు,. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తాం. ఏప్రిల్ 1 నాటికి 22 నియోజకవర్గాలు, మే నాటికి 46 నియోజకవర్గాలు, జూన్ నాటికి 70 నియోజకవర్గాలు, జులై నాటికి 106, ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో ప్యాక్చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ వుంటుంది. నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం 30 చోట్ల 99 నాణ్యమైన బియ్యం ప్యాకింగ్ యూనిట్లు వుంటాయి. ఇందులో 41 సివిల్ సప్లై వి కాగా, మరో 58 చోట్ల పీపీపీ మోడల్లో ప్యాకేజ్డ్ యూనిట్లు,  ప్రతి 30–40 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్యాకేజీ యూనిట్ వుంటుంది. నెలకు 2వేల టన్నుల బియ్యాన్ని ప్యాకేజీ చేసే సామర్థ్యం వుంటుంది. సత్వర పంపిణీకోసం అందుకు తగ్గ సిబ్బంది, వాహనాలు ముందుగానే గుర్తింపు ఏర్పాట్లు చేసామని అన్నారు. పర్యావరణానికి హానిజరగకుండా బియ్యాన్ని ప్యాక్చేయడానికి వాడుతున్న సంచులను తిరిగి సేకరించేలా చూడాలని సీఎం ఆదేశించారు.

No comments:

Post a Comment