Breaking News

03/01/2020

నితీష్ కుమార్, సుశీల్ మోదీతో ఆర్జేడీ వ్యంగ్య పోస్టర్‌

పాట్నా జనవరి 3 (way2newstv.in)
అసెంబ్లీ ఎన్నికల ఏడాది కావడంతో బిహార్‌లో అధికార, విపక్ష పార్టీల మధ్య పోస్టర్ల యుద్ధానికి తెరలేచింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్‌తో మోదీతో కూడిన ఓ వ్యంగ్య పోస్టర్‌ను విపక్ష రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తాజాగా తమ పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసింది. ఇందులో నితీష్, సుశీల్ మోదీ‌లు తలపై బుట్టలతో కనిపిస్తున్నారు. 'అబద్ధాలు, స్కామ్‌ల బాస్కెట్' అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు దీనికి ఆర్జేడీ జోడించింది.
నితీష్ కుమార్, సుశీల్  మోదీతో ఆర్జేడీ వ్యంగ్య పోస్టర్‌

దీనికి ముందు, ఆదాయం పన్ను ఇంటర్‌సెక్షన్ కార్యాలయం వెలుపల లాలూప్రసాద్ యాదవ్ సారథ్యంలోని 15 ఏళ్ల  ఆర్జేడీ ప్రభుత్వ పాలనను, నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ పాలనతో పోలుస్తూ ఓ పోస్టర్ వెలిసింది. దీనికి ప్రతిగానే శుక్రవారం ఆర్జేడీ కార్యాలయం వెలుపల నితీష్, సుశీల్ మోదీల వ్యంగ్య పోస్టర్ వెలిసింది. 2020 చివర్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

No comments:

Post a Comment