Breaking News

12/12/2019

డబుల్ బెడ్‌రూం ఇండ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన

మహబూబాబాద్ డిసెంబర్ 12 (way2newstv.in)
జిల్లాలోని మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో రూ. కోటి 26 లక్షల నిధులతో నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్లకు ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పటు చేసిన సభలో శంకర్ నాయక్ మాట్లాడుతూ... గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రం దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. 
డబుల్ బెడ్‌రూం ఇండ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన

అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి డబుల్ బెడ్‌రూం ఇళ్ళు కట్టిస్తామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బాలాజీ, జెడ్పిటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, ఎంపీటీసీ పెరుమాండ్ల గట్టయ్య, నెల్లికుదురు మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment