Breaking News

13/09/2019

బాధితులకు ఎల్ వో సి నీ అందజేసిన మంత్రి

వనపర్తి సెప్టెంబరు 13 (way2newstv.in)
రోగగ్రస్తులనూ, బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులను పంపిణీ చేయడమే కాకుండా ఎల్ వో సి లను అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి వచ్చిన చెక్కులను, ఎల్వోసీ లను అందజేశారు. 
బాధితులకు ఎల్ వో సి నీ అందజేసిన మంత్రి

ఈ సందర్భంగా పెబ్బేర్ కు చెందిన అమర్నాథ్ కు 150000 ఎల్వోసీ పత్రాన్ని మంత్రి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను తుమ్మలపల్లి కి చెందిన కురుమన్న 19000, జంగమయ్య పల్లి కి చెందినసేవ్యనాయకు 7500, గోపాల్పేట చెందిన రాధాకృష్ణకు 12,500, తొగిమా నాయక్ 17,500, ఏదుట్ల కు చెందిన దక్షునికి 12,500 రూపాయల విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు.

No comments:

Post a Comment