Breaking News

23/07/2019

చంద్రబాబు ఖబద్డార్ అంటూ వార్నింగ్

హైద్రాబాద్, జూలై 23 (way2newstv.in)
శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. సభలో మాట్లాడేందుకు తమ ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం గందరగోళం సృష్టించేందుకే ప్రయత్నిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో 63మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడేందుకు అవకాశమే ఇచ్చేవారు కాదని, సభలో ఏదైనా మాట్లాడాలంటే అధ్యక్షా మైకు.. అధ్యక్షా మైకు.. అంటూ బతిమాలుకోవాల్సి వచ్చేదని అన్నారు.
మంచి పేరు వస్తోందని టీడీపీ బాధ : జగన్

గత అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌ను ఉద్దేశించి మగాడివా.. మగతనం ఉందా.. అంటూ అవమానించేలా మాట్లాడితే చప్పట్లు కొట్టిన పెద్ద మనిషి చంద్రబాబు అని శ్రీధర్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు. వీడ్కోలు సభలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. జగన్ అద్భుత ముఖ్యమంత్రి అని కితాబిచ్చారని, జగన్‌కు దక్కతున్న ప్రశంసలు చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ‘ఖబడ్దార్.. ఖబడ్దార్ చంద్రబాబూ.. నీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో’ అంటూ శ్రీధర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. 

No comments:

Post a Comment