Breaking News

04/06/2019

స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు జోరు


హైదరాబాద్, జూన్ 4 (way2newstv.in)
తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ దూసుకుపోయింది.సంగారెడ్డి జిల్లాలో మిరుదొడ్డి మండలం... రుద్రారం ఎంపీటీసీగా మంజులత (సీపీఎం) విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం... కొత్తగూడెం ఎంపీటీసీగా చిన్నక్క (సీపీఎం), కుర్నపల్లి ఎంపీటీసీగా రామారావు (సీపీఎం) విజయం సాధించారు.ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలో కాంగ్రెస్ బోణీ కొట్టింది.

 
స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు జోరు
సంగారెడ్డి మండలం కొత్లాపూర్ ఎంపీటీసీగా సామేల్ (కాంగ్రెస్) విజయం సాధించారు. కంగ్టి మండలం బాబల్గామ్ ఎంపీటీసీగా రుక్కవ్వ (కాంగ్రెస్) విజయం సాధించారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం సరిత గెలుపొందారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం... కక్కిరాలపల్లి ఎంపీటీసీగా రమేష్ (టీఆర్ఎస్), ఐనవోలు-2 ఎంపీటీసీగా మధుమతి (టీఆర్ఎస్) విజయం సాధించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం... చింతలపల్లి ఎంపీటీసీగా నాగేంద్రమ్మ (టీఆర్ఎస్) విజయం సాధించారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం... కడ్తాల్ ఎంపీటీసీగా గొల్ల రమేష్ (కాంగ్రెస్) విజయం సాధించారు. మొత్తంగా చూస్తే పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా చాటింది. 

No comments:

Post a Comment