Breaking News

30/03/2019

నన్ను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదే,

ఖమ్మం,మార్చ్ 30 (way2newstv.in):  
కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు గా ఉన్న పెన్షన్లను 2000 చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. గోదావరి జలాలను జిల్లాకు తీసుకురావడం కోసం 18000 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న కేసీఆర్ కు కృతజ్ఞతలని తెరాస అభ్యర్ది నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం అయన పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రైతులతో పాటుగా నర్సరీ రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందించేలా చేస్తానని హామీనిస్తున్నా. 


 నన్ను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదే,

నేను గెలిచిన తర్వాత అశ్వారావుపేటలో పూర్తిరోజు పర్యటించి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. *రాబోయే రోజుల్లో రైతులందరికీ ఉపయోగపడే బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ మారిందంటే దానికి సీఎం కేసీఆర్ కృషి,పట్టుదల కారణం.కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జూపల్లి. రమేష్ బండి.పుల్లారావు జక్కుల రాంబాబు నార్లపాటి మహేష్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

No comments:

Post a Comment