Breaking News

11/08/2018

టీడీపీ మునిగిపోతున్న పడవ : ఏపీబీజేపీ

విజయవాడ, అగష్టు 11 (way2newstv.in)
ఆంద్రప్రదేశ్ ను వంచించిన  కాంగ్రెస్ పార్టీ కి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో టీడీపీ మద్దుతు ఇవ్వడం సిగ్గుచేటు. టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. చంద్రబాబు పార్టీ సిద్దాంతాలను తుంగలో తొక్కుతున్నాడని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ లో మునిగిపోయిన పడవ లాగా టీడీపీ మారుతుంది. కాంగ్రెస్ పార్టీతో  చంద్రబాబు కుమ్మక్కు అయ్యారు. చంద్రబాబు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి పై కన్నా,జీవిఎల్  మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాయలసీమలో హైకోర్టు ఎందుకు పెట్టరు. రాయలసీమ కు అన్యాయం చేస్తుంది టిడిపి. 2015-16 సంబంధించిన అకౌంట్స్ వివరాలు కాగ్ అడిగితే సమాధానం ఎందుకు చెప్పరు. అమరావతి అభివృద్ధి ని.. బాహుబలి త్రీడీ బొమ్మలు లాగా చూపుతుంది చంద్రబాబు ప్రభుత్వం. రైల్వేజోన్, కడపఉక్కు కర్మాగారం కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏపీ ప్రబుత్వం డబ్బులు లేవు అంటూ... ఆడంబరాలకు వెళ్తూ రాష్ట్ర ఖజానాకు గండి కొడుతోందని అయన అన్నారు. 



టీడీపీ మునిగిపోతున్న పడవ : ఏపీబీజేపీ 

No comments:

Post a Comment