అమరావతి జనవరి 11 (way2newstv.in)
అమరావతి రాజధానిలో భారీగా పోలీసులు మోహరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జరుగుతున్న ఆందోళన 25 రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, ఎర్రబాలెం, వెలగపూడి సహా రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు మహాధర్నా కోసం రైతులు టెంట్లు వేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.టెంట్లు వేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
పోలీసు మయమయిన అమరావతి
మందడం గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఇళ్లలో నుంచి ఎవ్వరు బయటకు రావ్వొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన చోట రైతులు, మహిళలు నిరసన తెలుపుతూ ప్రత్యేక పూజ చేసారు. రాజధాని ప్రాంతంతోపాటు కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
No comments:
Post a Comment