Breaking News

20/01/2020

భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి పైపైకి

ముంబై, జనవరి 20  (way2newstv.in)
పెళ్లిళ్ల సీజన్ వస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. పసిడి ధర పరుగులు పెట్టింది. ఒకే రోజులో భారీగా పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కూడా జిగేల్‌మంది.అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర స్వల్పంగా తగ్గినప్పటికీ దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర పైకి కదిలింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి క్షీణిస్తూ రావడం కూడా బంగారం ధర పెరుగుదలకు దోహదపడిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం భారీగా పెరిగింది. ఏకంగా రూ.710 ర్యాలీ చేసింది. దీంతో బంగారం ధర రూ.41,050 నుంచి రూ.41,760కు పెరిగింది.అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 
భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి పైపైకి

అయితే 24 క్యారెట్ల బంగారం స్థాయిలో మాత్రం పరుగులు పెట్టలేదు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరుగుదలతో రూ.38,090 నుంచి రూ.38,280కు ర్యాలీ చేసింది.అమెరికా, చైనా మధ్య వాణిజ్య డీల్‌కు సంబంధించిన తొలి దశ ఒప్పందం కుదిరింది. అయితే ఇన్వెస్టర్లు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. డీల్ కుదిరినా కూడా ఇంకా ఇరు దేశాల మధ్య పలు అంశాలు అలానే ఉండిపోయాయి. వీటిల్లో ప్రస్తుత టారిఫ్‌లు కూడా ఒక భాగం. టారిఫ్‌ల కొనసాగింపు సహా పలు అంశాల విషయంలో ఇన్వెస్టర్లు ఇంకా ఆందోళగానే ఉన్నారు. దీంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడింది.బంగారం ధర పరుగులు పడుతూ ఉంటే కేజీ వెండి ధర ర్యాలీ చేసింది. కేజీ వెండి ధర ఈ రోజు రూ.100 పెరుగుదలతో రూ.49,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి.గ్లోబల్ మార్కెట్‌లో కూడా పసిడి స్వల్పంగా తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.17 శాతం తగ్గుదలతో 1557.65 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.19 శాతం క్షీణతతో 18.03 డాలర్లకు దిగొచ్చింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,100కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 పెరుగుదలతో రూ.40,300కు పెరిగింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.49,500కు ఎగసింది.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత ఏడాది దాదాపు 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.వచ్చే కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment