Breaking News

06/01/2020

చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే కేసు నమోదు

విజయవాడ జనవరి 6    (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు కేసు నమోదు చేసారు. దళిత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని నక్కలపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు బాబూరావు. దళిత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ను కించపరుస్తూ కామెంట్స్ చేసిన చంద్రబాబుపై..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. బాబు సీఎంగా ఉన్న సమయం నుంచి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిన తరువాత కూడా చంద్రబాబు తన పద్దతిని మార్చకోలేదని ఇక చంద్రబాబు బుద్ది మారదు అని చెప్పారు. 
చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే కేసు నమోదు

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ దళితుల్ని కించపరుస్తూ ఎన్నో సందర్భాల్లో మాట్లాడారన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రతి సందర్భంలో దళితులను అవమానించడం అలవాటై పోందన్నారు. ఇప్పటికీ ఆయన తన పద్దతి మార్చుకోలేదని.. దళిత అధికారిని అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. టీడీపీ లో ఉన్న దళితులు ఇప్పటికైనా చంద్రబాబు నిజ స్వరూపం తెలుసుకోవాలన్నారు.మాటకి ముందు మాటకి తరువాత 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు ...ఈ 40 ఏళ్లలో ఏ ఒక్కరోజైనా కూడా దళితుల పట్ల గౌరవం గా మాట్లాడారా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల ఎక్స్పిరియన్స్ అని చెప్పుకునే చంద్రబాబు కు ప్రతిసారి దళితులను అవమానించడం అలవాటు గా మారింది. ఇప్పటికి ఆయన తన పద్దతి మార్చుకోలేదని.. దళిత అధికారిని అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఇప్పుటికైనా ఆ పార్టీలో ఉన్న దళితులు ఆయన అసలు రూపాన్ని తెలుకోవాలన్నారు. కాగా ఏపీకి రాజథాని సమగ్రాభివృద్ది విషయం లో ఇటీవలే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూఫ్ ఇటీవలే తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కౌంటర్ ఇచ్చే సందర్భంలో చంద్రబాబు ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ను కించపరిచారని అధికార వైసీపీ ఆరోపణలు చేస్తోంది.

No comments:

Post a Comment