Breaking News

06/01/2020

డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

భద్రాచలం జనవరి 6 (way2newstv.in)
భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలంలోని గంగోలు గ్రామంలో రూ.2.83 కోట్లతో నిర్మించిన 45 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పాల్గొన్నారు.అనంతరం ఇళ్ళ ఆవరణంలో ఇద్దరు మంత్రులు మొక్కలు నాటారు. 
డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, ఎమ్మెల్యేలు పొందెం వీరయ్య, సంబంధిత అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment