Breaking News

27/12/2019

మీడియాపై దాడి

అమరావతి డిసెంబర్ 27  (way2newstv.in)
ఉద్దండ్రాయపాలెం దగ్గర మీడియా కవారేజి నిమిత్తం వెళ్లిన మీడియా ప్రతినిధులపై రైతులు  దాడులకు దిగారు. శుక్రవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష కవరేజి కవరేజి కోసం మీడియా ప్రతినిధులు వెళ్లారు. రెండు మూడు టీవీ ఛానళ్ల ప్రతినిధులపై అందోళనకారులు దాడులకు దిగారు.  కన్నాను ఇంటర్వ్యూ చేసే సమయంలో ముందుగా ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ పై దాడికి దిగారు. మహిళా జర్నలిస్ట్ పై దాడి చేయటం తగదని వారిని వారించే వరించే ప్రయత్నం చేసిన మరో టీవీ ప్రతినిధి పై కూడా దాడికి దిగారు.
మీడియాపై దాడి

వీరిపై దాడిని అడ్డుకోబోయిన మరికొందరు రిపోర్టర్ల పై కుడా వారు దాడి చేసారు. దీంతో విలేఖరులు  గాయాల పాలైయ్యారు.రైతుల దాడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చే క్రమంలో వెలగపూడి దగ్గర మరోసారి దాడి జరిగింది.  మీడియా కారు   అద్దాలు పగలగొట్టి మీడియా ప్రతినిధులు బయటికి రాకుండా దాడి చేసారు. ఘటనలో కారు ధ్వంసమైయింది. పిడిగుద్దులు, బండ రాళ్లు విసిరేపారు. సచివాలయంలోని ప్రధమ చికిత్సా కేంద్రంలో వారికి కి వైద్యం అందించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికి ఆగకుండా దాడి జరిగింది. .పోలీసులకు సైతం గాయాలు అయ్యాయి. దాడి చేసిన వారిలో అత్యధిక శాతం మహిళలు ఉండటం గమనార్హం.

No comments:

Post a Comment