Breaking News

21/11/2019

పంటల మార్పిడి మీద రైతులు దృష్టి సారించాలి: మంత్రి సింగిరెడ్డి

హైదరాబాద్ నవంబర్ 21 (way2newstv.in):
;పంటల మార్పిడి మీద రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్  రెడ్డి ఆన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మొదటి అంతర్ కళాశాలల క్రీడా పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా  మంత్రి మాట్లాడుతూ ఒకటే పంట వేయడం మూలంగా మేలైన ధరలకుఅవకాశాలు లభించడం లేదన్నారు.-సాగునీటి రాకతో ఉద్యాన పంటలకు భవిష్యత్ చేకూరిందని- ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో సాగునీటి కల సాకారమవుతున్నట్లు రెడ్డితెలిపారు. రాష్ట్రంలో భారీ ఎత్తున పంటల ఉత్పాదకత పెరిగిందన్నారు.- 
పంటల మార్పిడి మీద రైతులు దృష్టి సారించాలి: మంత్రి సింగిరెడ్డి

వరి పంటను మాత్రమే కాకుండా ఇతర పంటలను తెలంగాణ ప్రాంత నేలలు, వాతావరణం ఉద్యాన పంటలకు అనుకూలం- దేశ ఉద్యాన ఉత్పత్తుల అవసరాలు తీర్చే అవకాశం మనకే ఉంది- ములుగులో పూర్థి స్థాయి మౌళిక సదుపాయాలతో ఉద్యాన విశ్వవిద్యాలయ కళాశాల సిద్దం- ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం- పదివేల ఏళ్ల క్రితం మానవుడి స్థిర  వ్యవసాయం మధ్య ఆసియాలో మొదలయింది - అయితే మానవపుట్టుక నాటికే ప్రకృతిలో ఉద్యాన పంటలు ఉన్నాయి వాటితోనే మానవుడు తొలి  ఆహార అవసరాలు తీర్చుకున్నాడు- ప్రకృతిలో మొదట లభించింది పండ్లు, కూరగాయలు... ఉద్యాన పంటల అవసరం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది- గత పాలకుల అనాలోచిత చర్యల మూలంగా వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదు ఇంజనీరింగ్ కళాశాలలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి నిరుద్యోగాన్ని పెంచిపోషించారు- టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో ప్రక్షాళన చేపట్టింది- రైతుల అవసరాలను తీర్చే, ఉపాధి కల్పించే వ్యవసాయ, ఉద్యాన, పాలిటెక్నిక్ కళాశాలలకు మంజూరు ఇవ్వడం జరుగుతుందివరంగల్, పాలెంలలో వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వ్యవసాయ, ఉద్యాన కళాశాలల ప్రాంగణాలలో పచ్చదనం వెల్లి విరియాలి .. అదే సమయంలో పరిశుభ్రత పాటించాలి- మోజర్ల ఉద్యాన కళాశాలకు అనుబంధంగా ఉన్న మదనాపురం క్షేత్రానికి రామన్ పాడు నీటిని అందిస్తాం- కళాశాలలో మౌళిక వసతులు కల్పిస్తాం .. ప్రత్యేక నిధులతో విశ్వవిద్యాలయ అభివృద్దికి పాటుపడతామన్నారు.

No comments:

Post a Comment