Breaking News

23/10/2019

కోడుమూరులో వైసీపీకి భారీ షాక్

కర్నూలు అక్టోబర్ 23(way2newstv.in)
కోడుమూరులో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అంతటా అధికారంలో ఉన్న పార్టీలో ప్రతిపక్ష నాయకులు , కార్యకర్తలు చేరుతుంటే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. వైసీపీకి చెందిన 200 మందికి పైగా కార్యకర్తలు అధికార పార్టీ వైసీపీకి షాక్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కార్యకర్తలు వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. కోట్ల సమక్షంలో దాదాపు 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీలో కష్టపడి పని చేసిన వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 
కోడుమూరులో వైసీపీకి భారీ షాక్

ఇక ప్రస్తుత ఎమ్మెల్యే విధి, విధానాలు నచ్చకే తామంతా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు వారు మీడియా కు తెలిపారు. పార్టీలో చేరిన వారందరినీ అన్ని విధాలుగా కోట్ల ఫ్యామిలీ ఆదుకుంటుందని కోట్ల సుజాతమ్మ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆరాచకాలు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇసుక కొరత కారణంగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని అన్నారు. ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరినీ ప్రభుత్వంతో పొరాడి వారిని కోట్ల కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రఫీక్ , రవీంద్ర గౌడ్, పూల శేఖర్, వేణు గోపాల్ రెడ్డి, గోవింద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment