Breaking News

16/10/2019

వైకాపాలోకి రాజోలు మాజీ ఎమ్మెల్యే

తాడేపల్లి అక్టోబర్ 16, (way2newstv.in):
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరాం. రాజోలులో వైస్సార్సీపీని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పథకాలు విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా వంతు కృషి చేస్తామని రాజోలో మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు అన్నారు. బుధవారం అయన ముఖ్యమంత్రి సమక్షంలో వైకాపా కండువా కప్పుకున్నారు. 
ఉద్యమ ప్రజా నాయకులంతా రాజీనామా చేయాలి

తరువాత మీడియాతో మాట్లాడుతూ జగన్ పరిపాలన బాగుండటం వల్ల మేము తిరిగి వైస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం. పథకాలు చాలా బాగున్నాయి..అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు. ప్రజల వద్దకు అన్ని సర్వీసులు తీసుకువెళుతున్నారు. తండ్రిని మించిన తనయుడిగా పెరు తెచ్చుకుంటారని అన్నారు. రాబోయే రోజుల్లో రాజోలులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని అన్నారు.

No comments:

Post a Comment