తిరుమల అక్టోబరు 5, (way2newstv.in)
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ సేవను టిటిడి దేవస్థానం రాత్రి దిగ్విజయంగా పూర్తి చేయగలిగింది. తిరుపతి అర్బన్ పోలీసులు, టిటిడి విజిలెన్స్ అధికారులు,టిటిడి అధికారులు అందరూ కలిసి చిన్న చిన్న ఘటనలు మినహా గరుడోత్సవాన్ని పూర్తి చేయగలిగారు.. దాదాపు 3 లక్షలకు పైగా స్వామివారి వాహన సేవలో గరుడోత్సవం ను తిలకించారు.
గరుడోత్సవం... ప్రశాంతం
మాడవీధుల్లో నిన్న మధ్యాహ్నం నుంచే గరుడోత్సవం తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటికీ రాత్రి 7 గంటలకుప్రారంభమైన వాహనసేవ అనంతరం కాస్త తోపులాటలు, చిన్నచిన్న తొక్కిసలాటలు జరిగాయి. ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్న సమయంలో వర్షం బీభత్సం సృష్టించడంతో గ్యాలరీస్ లో ఉన్న భక్తులు చాలా వరకు వర్షంలో తడుస్తూనే స్వామివారి వాహన సేవను తిలకిచారు. వర్షం భీభత్సానికి గ్యాలరీస్ లో మహిళలు చిన్న పిల్లలు వృద్ధులు చాలా అవస్థలు పడ్డారు.
No comments:
Post a Comment