Breaking News

31/10/2019

శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు

అమరావతి  అక్టోబర్ 31, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరుకానున్నారు. 
శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు

విభజన తర్వాత తొలిసారిగా అధికారికంగా అవతరణ వేడుకలు నిర్వహించనుండటంతో ప్రభుత్వం వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని నిర్ణయించింది. తొలి రోజున హస్తకళలు, చేనేత కళల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. రెండో రోజు కూచిపూడి నృత్య ప్రదర్శన, లలిత కళలు, సురభి నాటకాలు, జానపద కళల ప్రదర్శనలు ఉంటాయి. మూడో రోజున తెలుగు సంప్రదాయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.

No comments:

Post a Comment