టిడిపి పార్టీ శ్రేనులకు చంద్రబాబు పిలుపు
రాజమహేంద్రవరం సెప్టెంబర్ 5 (way2newstv.in)
;తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం రాజమహేంద్రవరం లాలాచెరువు జుంక్షన్లోఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శియర్ర వేణు గోపాల రాయుడు, టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, తదితరులు చంద్రబాబును దుశ్శాలువాతో సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైస్సార్సిపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ ప్రజకు అండగానిలవాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. అక్కడ నుంచి కాకినాడ లో జరిగే కార్యక్రమాలకు వెళ్లారు. ఈ సంధర్భంగా టీడీపీ కార్యకర్తలు పార్టీ జెండాలుపట్టుకుని జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, గగ్గర సూర్యనారాయణ, కురగంటి ఈశ్వరి, సింహా నాగమణి, పాలవలసల వీరభద్రం, తంగెళ్ల బాబి, ఇన్నమూరి రాంబాబు, పితాని లక్ష్మీకుమారి, తలారి ఉమా, గరగ పార్వతి, బెజవాడ రాజ్కుమార్, కోరుమిల్లి విజయశేఖర్, మజ్జి పద్మ, కప్పల వెలుగు కుమారి, మానే దొరబాబు, గొర్రెల రమణి,బొమ్మనమైన శ్రీనివాస్, గొర్రెల సురేష్, కూరాకుల తులసి, నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, ఉప్పులూరి జానకి రామయ్య, కురగంటి సతీష్, హితకారిణి సమాజం ఛైర్మన్ యాళ్ల ప్రదీప్, షేక్ సుభాన్, మజ్జి రాంబాబు, పెనుగొండ రామకృష్ణ, కొయ్యల రమణ, మరుకుర్తి రవి యాదవ్, నక్కా దేవి, బొత్సా రమణ, కొమ్మా రమేష్, బొత్స శ్రీను, గరగ మురళి, సత్తి వెంకట సాయిసందీప్, మాలే విజయలక్ష్మి, మొకమాటి సత్యనారాయణ, పితాని కుటుంబరావు, తురకల నిర్మల, చౌదరి, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.జిల్లాపర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం లాలా చెరువు జంక్షన్కు చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్ర వేణు గోపాల రాయుడు, టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణిలు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా అధైర్య పడాల్సిన పని లేదని, మనకేం జరిగిన చంద్రబాబునాయుడు అండగా ఉంటారని అన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ పధంలో నడిపించాలని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment