Breaking News

19/08/2019

దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి సమీక్ష

హైదరాబాద్  ఆగష్టు 19  (way2newstv.in)
దేవాదుల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ ల నుంచి చెరువులకు, పొలాలకు నీటి సరఫరా పకడ్బందీగా జరగాలని పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం  నీటి విడుదల ప్రణాళిక పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి సమీక్ష

జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల  సమోత రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, దేవాదుల సీ.ఈ బంగారయ్య, ఎస్.ఈ. సుధాకర్ రెడ్డి తోపాటు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల సాగునీటి శాఖ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment