Breaking News

19/08/2019

డ్రోన్ వినియోగంలో కుట్ర లేదు వివాదం పై డీజీపీ వివరణ

విజయవాడ ఆగష్టు 19  (way2newstv.in - Swamy Naidu)
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగురవేసిన వివాదం పై రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ వివరణ ఇచ్చారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ వివాదంపై స్పష్టత ఇచ్చారు. వరదల కారణంగా అంచనా కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రోన్ ఉపయోగించిందని స్పష్టం చేశారు. అయితే.. లోకల్ పోలీసులకు సమాచారం లేకపోవడంతో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. ఇందులో ఎటువంటి కుట్రా లేదన్నారు. 

 డ్రోన్ వినియోగంలో కుట్ర లేదు  వివాదం పై డీజీపీ వివరణ
దీనిని రాజకీయం చేయవద్దని.. ఇకపై ఎవరైనా డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు. ఇరిగేషన్ అధికారులకు, స్థానిక పోలీసులకు మద్య సమన్వయం లేని కారణంగా ఈ వివాదం నెలకొందని డీజీపీ సవాంగ్ వివరించారు. 

No comments:

Post a Comment