Breaking News

19/08/2019

నడ్డా పేరు అబద్దాల అడ్డా

హైదరాబాద్ ఆగష్టు 19  (way2newstv.in)
టి ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజెపి పార్టీ పై నిప్పులు చెరిగారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఎగిరి ఎగిరి పడుతుందన్నారు. బిజెపి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తన పేరును అపద్దాల అడ్డాగా మార్చుకోవాలని విమర్శించారు. బిజెపి పార్టీ నేతలు అవాస్తవాలను మాట్లాడుతూ ప్రజలను భ్రమ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా ఏంటో చూపించి కమలం పార్టీ నేతల నోర్లు ముయిస్తామని అయన  చెప్పారు. 
నడ్డా పేరు అబద్దాల అడ్డా

సోమవారం హైదరాబాద్ కూకట్ పల్లి లో నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశానికి హాజరయిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజెపి పార్టీ పై విరుచుకుపడ్డారు. బిజెపి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ముఖ్యమంత్రి కేసీఆర్ పై దుష్ప్రచారం చేశారన్నారు. జేపీ నడ్డా పచ్చి అపద్దాల కోరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొట్టి వేరే పేర్లతో అమలు చేస్తోంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు.ఈ సమావేశంలో పాల్గోన్న తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ,మల్లారెడ్డి లు మాట్లాడుతూ బిజెపి పార్టీ ఒక్క ఎమ్మెల్యేతో ఏదో చేయగలం అనే బ్రమల్లో బ్రతుకుతుంది అని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తే 103 స్తానల్లో డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు. ప్రజలు ఎన్నికల్లో సమాధానం చెప్పిన బిజెపి నేతలకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎదుగుదల ని బిజెపి నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుదమని కమలం పార్టీ నేతలు అనుకుంటే ప్రజలే గుణపాఠం నేర్పుతారన్నారు.

No comments:

Post a Comment