జోగులాంబ గద్వాల జూలై 23 (way2newstv.in)
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా లో మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు, స్కూల్ ఇన్చార్జి వసుంధర ను విద్యార్థుల నోటు బుక్కుల విషయం గురించి విద్యార్థులకు ఎన్ని బుక్స్ అందించారు ఎన్ని మిగిలినవి అని అడిగి తెలుసుకున్నారు.
సంక్షేమ గృహాన్ని పరిశీలించిన జడ్పీ చైర్ పర్సన్
విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి అల్పాహారం రోజూ మేను పట్టిక, కిచెన్ లో బియ్యం స్టాక్ ను పరిశీలించారు, వంటగదిలో వంట పాత్రలను పరిశీలించారు, వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని వంట సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు, విద్యార్థులతో పాటే అక్కడే కూర్చుని భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనాథ్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ కురువ పలయ్య, పాల్గొన్నారు.
No comments:
Post a Comment