అమరావతి జూలై 23 (way2newstv.in)
రెయిన్ గన్ లకు టెక్నికల్ సపోర్టు ఇవ్వడంలో గత ప్రభుత్వం విఫలమైందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం శాసనమండలిలో క్వశ్చన్ అవర్లో భాగంగా రెయిన్గన్లకు సంబంధించి మంత్రి మాట్లాడారు. 116 కోట్ల రూపాయలు వెచ్చించి గత చంద్రబాబు ప్రభుత్వం రెయిన్గన్లను కొనుగోలు చేసిందని తెలిపారు.
టెక్నికల్ సపోర్ట్ లేకపోవడం వల్లే రెయిన్గన్ల ప్రయోగం విఫలం: బొత్స
కేవలం ఒక ఏడాది, ఒక సీజన్లో మాత్రమే వాటిని వినియోగించారని పేర్కొన్నారు. టెక్నికల్ సపోర్ట్ లేకపోవడం వల్లే రెయిన్గన్ల ప్రయోగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ సొమ్ము పూర్తిగా వృథా అయిందని మండిపడ్డారు. వీటి ద్వారా ఒక్క ఎకరాకు కూడా అదనపు సాగు జరగలేదని వెల్లడించారు. ఎవరైనా సభ్యులు అడిగితే రెయిన్గన్లపై విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment