Breaking News

05/03/2019

వివాదాలు, ఘర్షణలు వద్దు

ఒంగోలు, మార్చి 5, (way2newstv.in )
రాజకీయ నాయకులకు అవినీతి చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు. శిద్దారాఘవరావు, మాగుంట శ్రీనివాసులు లు అపర కుబేరులు. వారిలా 100 కోట్లు వెచ్చించి ఓటర్లను కొనే శక్తి నాకు లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం నాడు అయన ఒంగోలులో జనసేన శ్రేణులతో మాట్లాడారు. లోకెష్, చంద్రబాబు, జగన్ పెద్ద వాల్లు.  నేను క్రింది స్తాయి నుండి ఒక్కో క్క మెట్టు పేర్చుకుంటూ రాజకీయంగాఎదుగుతున్నాను. జనసేన కార్యకర్తలు వివాదాలు, ఘర్షణలకు పోకుండా కలిసి కట్టుగా క్రమశిక్షణ తో పార్టీ అభివృద్ధి కోసం పనిచేయండని అన్నారు. 


వివాదాలు, ఘర్షణలు వద్దు

జనసేన అధికారం టార్గెట్ 2019 కాదు 2024. అప్పటివరకు ఒక్కో.. క్కటిగా మన సొంతం చేసుకుంటూ పోదాం. రాజకీయాలలో అధికారం అనేది కొన్ని కుటుంబాల చేతిలో ఉన్నాయని అయన అన్నారు. పేదలకు అండగా ఉండటమే జనసేన లక్ష్యం. వెలిగొండ ప్రాజెక్టు పై ప్రభుత్వాలకు శ్రద్ధ లేదు. ఒంగోలు లో ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువ గా ఉంది  ఇక్కడ యూనివర్సిటీ  కోసం జనసేన కృషి చేస్తుందని మాట ఇస్తున్నాను. మీరు అనుకున్నంతగా నేను మంచి వాడిని కాదు.  రాజకీయాలు నాకు తెలుసు.  హక్కుల కోసం పుట్టిన పార్టీ జనసేన. కేసీఆర్ కూడా నాకు ఒక్క శాతం ఓట్లుఅంటున్నారు .  నేను లెక్కలు వేసుకొని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. 

No comments:

Post a Comment