Breaking News

05/03/2019

ఎంపీ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయం

హైదరాబాద్, మార్చి 5, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్రంలోనే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గం ఆదర్శంగా నిలవాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో 5 లక్షల పైగా ఓట్లతో గెలుపొంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని  రాష్ట్ర కార్మిక,శిశు సంక్షేమ,కార్మాగార శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం  బోయిన్ పల్లి మల్లారెడ్డి గార్డెన్ లో ఎంఎల్సి  బి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన మల్కాజిగిరి పార్లమెంట నియోజక వర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 


ఎంపీ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయం

మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్రంలో 16 ఎం పి నియోజక వర్గాలలో ఖచ్ఛితంగా టీఆర్ఎస్ గెలపుఖాయమని అన్నారు. అయితే భారీ మెజార్టీతో గెలవాలని, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేయాలని అన్నారు. ఈ నెల 8వ తేదీ న కరీంనగర్ జివిఆర్ గార్డెన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ అధ్యక్షతన జరుగ నున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్నారు. అసెంబ్లీ నియోజక వర్గం నుంచి మూడు వేల మంది కార్యకర్తలు హాజరు కావాలని కూడా మల్లారెడ్డి పిలుపు నిచ్చారు. ఈ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీ లు, మాజీ ఎమ్మేల్యేలు, జెడ్పిటిసి లు,  ఎం పి టి సి లు, వివిధ  సంస్థల చైర్మన్ లు,కార్పొరేటర్లు,కౌన్సిలర్లు,వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.మంత్రి మల్లారెడ్డి మొదటి సారిగా కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో నాయకులు, కార్యకర్తలు ఆయనను సన్మానాలతో ముంచెత్తారు.

No comments:

Post a Comment