Breaking News

05/03/2019

ఇక దేశవ్యాప్తంగా వన్ నేషన్.. వన్ కార్డ్

న్యూఢిల్లీ మార్చి 5 (way2newstv.in)
మన దేశంలో ప్రజలు ఒక చోట నుంచి మరోచోటుకు వెళ్లాలంటే ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్పై ఆధారపడుతుంటారు. ప్రయాణ సమయాల్లో ప్రతిచోట పేమెంట్ మోడ్ ఒకేలా  ఉండకపోవచ్చు. భిన్నంగా ఉంటుంది. దీంతో ప్రయాణ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఇకపై ట్రావెల్ చేసేందుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం  లేదు. దేశవ్యాప్తంగా అన్నీ ట్రాన్స్పోర్టులకు ఒకే కార్డు అందుబాటులోకి వచ్చింది. ఆ మాటకు వస్తే ఏ రకమైన చెల్లింపులైనా జరపొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ  ‘వన్ నేషన్..  వన్ కార్డ్’ను ఆవిష్కరించారు. భారతదేశపు తొలి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ) ఇది. 


ఇక దేశవ్యాప్తంగా వన్ నేషన్.. వన్ కార్డ్

దీని వల్ల ప్రయాణికులు దేశంలో ఎక్కడికైనా సులభంగా ప్రయాణించొచ్చు. అలాగే బస్సు ట్రావెల్, టోల్ ట్యాక్సులు, పార్కింగ్ చార్జీలు, రిటైల్ షాపింగ్, క్యాష్ విత్డ్రా వంటి ప్రత్యేకతలు ఈ కార్డు సొంతం. విదేశీ టెక్నాలజీపై ఆధారపడాల్సిన అవసరం 
లేదని మోదీ ఈ కార్డు ఆవిష్కరణ సందర్భంగా పేర్కొన్నారు. మేడిన్ ఇండియా కార్డ్ ఇదని తెలిపారు. ప్రపంచంలోని కొద్ది దేశాలు మాత్రమే ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయని 
పేర్కొన్నారు. 
వన్ నేషన్.. వన్ కార్డ్ ప్రయోజనాలు 
✪ డెబిట్, క్రెడిట్ లేదా ప్రిపెయిడ్ కార్డు రూపంలో బ్యాంకుల ఈ కార్డును జారీ చేస్తాయి.
✪ రూపే డెబిట్/క్రెడిట్ కార్డు మాదిరే ఉంటుంది. 25కు పైగా బ్యాంకుల్లో ఈ కార్డులు పొందొచ్చు. 
✪ మెట్రో, బస్సు, రైల్వేస్, స్మార్ట్ సిటీ, రిటైల్ షాపింగ్ వంటి వాటికి ఈ కార్డు ద్వారా చెల్లింపుల జరపొచ్చు. 
✪ టోల్ ప్లాజాల బిల్లులు, పార్కింగ్ చార్జీలు కూడా చెల్లించొచ్చు. 
✪ కార్డు ద్వారా చెల్లింపులతో క్యాష్బ్యాక్ కూడా పొందొచ్చు. విదేశాల్లో ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకుంటే 5 శాతం క్యాష్బ్యాక్ వస్తుంది. మర్చంట్ ఔట్స్లెట్స్లో 
చెల్లింపులపై 10 శాతం క్యాష్బ్యాక్. 
✪ స్వాగత్, స్వీకార్ వంటి వాటిని కూడా ఈ కార్డు సపోర్ట్ చేస్తుంది. 
✪ టీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కూడా ఈ కార్డును పొందొచ్చు.

No comments:

Post a Comment