Breaking News

22/03/2019

పవన్ పై విజయసాయి రెడ్డి సెటైర్లు

హైద్రాబాద్, మార్చి 22, (way2newstv.in)
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఎన్నిసార్లు మోసం చేస్తారు పవన్ కళ్యాణ్ గారూ? అంటూ ఆయన జనసేనానికి ప్రశ్నలు సంధించారు. ‘పోటీ చేస్తే ఓట్లు చీలాయనే కారణంతో గత ఎన్నికల్లో నిలబడలేదన్నారు. ఈసారి మీ యజమాని చెప్పినట్టు పోటీ చేసి ఓట్లు చీల్చాలని అనుకుంటున్నారు. జనాలను ఒక్కసారి నమ్మించగలరేమో. కానీ ప్రతిసారీ మీ ప్యాకేజీ కుప్పిగంతులను అర్థం చేసుకొని అమాయకులేం కాద’ని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్‌కు పవన్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తుండగా.. జగన్ అభిమానులు వారికి అదే రీతిలో బదులిస్తున్నారు. 


పవన్ పై  విజయసాయి రెడ్డి సెటైర్లు

జేడీ లక్ష్మీనారాయణ విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీపీ అభిమానులు విమర్శిస్తుండగా.. మీరేందుకు బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నారని జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.ఎన్నిసార్లు మోసం చేస్తారు పవన్ కళ్యాణ్ గారూ? కిందటి ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలతాయని నిలబడలేదన్నారు. ఈసారి మీ యజమాని చెప్పినట్టు పోటీ చేసి ఓట్లు చీల్చాలను కుంటున్నారు. ఒకసారి నమ్మించగలరేమో. కానీ ప్రతిసారీ మీ ప్యాకేజీ కుప్పిగంతులను అర్థం చేసుకోలేని అమాయకులేం కాదు ప్రజలు గాజువాకలో నామినేషన్ అనంతరం భీమిలీ నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం సభలో మాట్లాడిన పవన్.. ఏ2 ముద్దాయికి నిజాయతీపరుడైన అధికారిని విమర్శించే హక్కులేదని విజయ సాయిరెడ్డిపై విమర్శలు చేశారు. లక్ష్మీనారాయణను ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే.. విజయసాయి రెడ్డికి ఎందుకంత భయం అని ఆయన ప్రశ్నించారు. 

No comments:

Post a Comment