నిజామాబాద్, ఫిబ్రవరి 18, (way2newstv.in)
తెలుగు విద్యార్ధులు మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. 6,962 మీటర్ల అకొంకాగ్వా పర్వతాన్ని నిజామాబాద్ జిల్లాకు చెందిన మాలవత్ పూర్ణ అధిరోహించింది. నాలుగు ఖండాల్లో అత్యంత ఎత్తైన పర్వతాలను అతి చిన్న వయసులో ఎక్కిన గిరిజన మహిళగా రికార్డు సృష్టించింది.
తెలుగు విద్యార్ధుల మరో రికార్డు
దక్షిణ అమెరికా ఖండంలో అర్జెంటీనా అండీస్ పర్వత శ్రేణిలో ఎత్తైన శ్రేణి అకొంకాగ్వా పర్వతాలు. మాలవత్ పూర్ణతో పాటు తూర్పు గోదావరి జిల్లా కుంజావారి గూడెం కు చెందిన దుర్గారావు కుడా ఈ పర్వతాన్ని అధిరోహించాడు. మాలవత్ పూర్ణ కామారెడ్డి జిల్లా ఎస్సి గురుకుల కళాశాలలో డిగ్రీ చదువుతోంది. పూర్ణ ఇంతకుముందే ఎవరెస్టు శిఖరంతో పాటు నాలుగు ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment