Breaking News

09/02/2019

తల్లికి తెలియకుండా శిశువును అమ్మేసిన డాక్టర్

మచిలీపట్నం, ఫిబ్రవరి 9,(way2newstv.in)
 కృష్ణా జిల్లా మచిలీపట్నం వాణి ఆస్పత్రిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన మగశిశువును తల్లికి తెలియకుండా డాక్టర్ అమ్మేసింది. కుటుంబసభ్యులు ప్రశ్నించగా కడుపులో శిశువు లేదని గడ్డని మాత్రమే బయటకు తీశామని డాక్టర్ చెప్పింది.  బాధితురాలు కనకుదుర్గ వికలాంగురాలు. ఆమె కు సంబంధించిన రికార్డును కుడా డాక్టర్ మాయం చేసింది. 


తల్లికి తెలియకుండా శిశువును అమ్మేసిన డాక్టర్

దీంతో డాక్టర్ను బాధితురాలి బంధువులు నిలదీశారు. కనకదుర్గ డెలివరీ కోసం  జవ్వారుపేట సెంటర్లోని వాణి హాస్పిటల్ లో చేరింది. ఆమెకు డెలివరీ అయి మూడురోజులుగా గడిచినా శిశువును తల్లికి చూపించకుండా వైద్యురాలు పరసా వాణి కుసుమ  తత్సర్యం చేసిందని పేషంట్ బంధువులు ఆరోపిస్తున్నారు.  ఇనుగుదురుపేట పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. డాక్టర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. శిశువును విజయవాడలోని పాత గవర్నమెంట్ ఆసుపత్రి పిల్లల వార్డులో వైద్యం కోసం ఉంచిన వైనాన్ని గుర్తించారు. మచిలీపట్నం, దేశాయి పేటకు చెందిన లక్షినారాయణ  అనే వ్యక్తి శిశువును తీసుకుని వెళ్లి వైద్యం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డాక్టరే లక్ష్మీనారాయణకు శిశువుని అమ్మేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

No comments:

Post a Comment