Breaking News

13/11/2019

నా పెళ్లళ్ల గురించి మీకేందుకు ?

అమరావతి నవంబర్ 12 (way2newstv.in)
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అయన  మాట్లాడితే తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని.. తన పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక సమస్యపై గవర్నర్ ను కలిసిన అనంతరం విజయవాడ జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు.  ప్రతిసారి నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటున్నారని.. తాను చేసుకున్న పెళ్లిళ్ల వల్లే రెండేళ్ల జైలుకు వెళ్లారా? అని జగన్ను ఉద్దేశించి పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
నా పెళ్లళ్ల గురించి మీకేందుకు ?

తానేమీ సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని అన్నారు.  నేను ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు బాధ? కావాలంటే మీరూ చేసుకోండి అంటూ విరుచుకపడ్డారు.  మూడేళ్లపాటు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం రాదనుకున్నానని.. ప్రభుత్వ వైఖరితో నాలుగు నెలలకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని పవన్కల్యాణ్ అన్నారు. ప్రజల కష్టాల గురించి తాము అడిగితే వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  జనసేన అంటే భయపడే వ్యక్తిగత విషయాల జోలికి వస్తున్నారన్నారు. సద్విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి అని స్పష్టం చేశారు. కానీ వైసీపీ సంస్కృతి వ్యక్తిగత విమర్శలతో మీద పడిపోవడమేనని ఆరోపించారు.

No comments:

Post a Comment