Breaking News

01/11/2019

శ‌ర్వానంద్ హీరోగా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న చిత్రంలో అమ‌ల అక్కినేని

శ‌ర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారంనాడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. అమ‌ల అక్కినేని ఈ చిత్రంలో శ‌ర్వానంద్ త‌ల్లిపాత్ర‌లో న‌టిస్తుంటే.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ తండ్రి, న‌టుడు ర‌వి రాఘ‌వేంద్ర హీరో తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు. సెల‌క్టివ్ సినిమాల్లోనే న‌టించే అమ‌ల అక్కినేని, క‌థ‌, త‌న పాత్ర న‌చ్చ‌డంతో ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకున్నారు.
శ‌ర్వానంద్ హీరోగా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న చిత్రంలో అమ‌ల అక్కినేని

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర్వానంద్‌, అమ‌ల అక్కినేని, ర‌వి రాఘ‌వేంద్ర పాత్ర‌ల మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. నాజ‌న్‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి  ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్నేహం, ప్రేమ మ‌ధ్య విడ‌దీయ‌రాని బంధాన్ని తెలియ‌జేసేలా ఈ చిత్రం  ఉంటుంది. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు అందిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతాన్ని, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. రీసెంట్‌గా `ఖైదీ` చిత్రంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌క్సెస్‌ను సాధించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని కూడా తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 స‌మ్మ‌ర్‌లో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.
న‌టీన‌టులు: శ‌ర్వానంద్‌, రీతూవ‌ర్మ‌, అమ‌ల అక్కినేని, ర‌వి రాఘ‌వేంద్ర‌, వెన్నెల‌కిషోర్‌, నాజ‌ర్‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు

No comments:

Post a Comment