Breaking News

10/07/2019

కట్టుకుంటున్న దొరసాని ట్రైలర్

హైద్రాబాద్, జూలై 10, (way2newstv.in)
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘బ్రోచేవారెవరురా’.. ‘ఓ బేబీ’ సినిమాలతో టాలీవుడ్ బాక్సఫిస్ పుంజుకుంది. ఈసినిమాలు ఓ మోస్తరుగా థియేటర్స్ లో ఆడుతున్నాయి. ఇక ఈ వారం రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఆ రెండు సినిమాలను కొత్త డైరెక్టర్స్ తీశారు. ఈచిత్రాలు ప్రధాన పాత్రధారుల కెరీర్లను నిర్దేశించేవి కావడం గమనార్హం.సందీప్ కిషన్, వెన్నెల కిషోర్ లీడ్ పాత్రల్లో వస్తున్నా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’ . ఇది ఒక హార్రర్ థ్రిల్లర్. చాలాకాలం గ్యాప్ తరువాత సందీప్ కిషన్ ఎన్నో హోప్స్ పెట్టుకుని చేస్తున్న చిత్రం. 
కట్టుకుంటున్న దొరసాని ట్రైలర్

వరస ఫ్లాపులతో మార్కెట్ దాదాపుగా జీరో అయిపోయిన సమయంలో తన సొంతంగా ఈసినిమాను నిర్మించాడు. దీన్ని కార్తీక్ రాజు అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. చూద్దాం సందీప్ ఈసినిమా తో గట్టెక్కుతాడేమో..అలానే ఈసినిమాతో పాటు మరో చిన్న సినిమా వస్తుంది. విజయ్ దేరవకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ను హీరోగా పరిచయం చేస్తూ యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం చేసిన ‘దొరసాని’ ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రిలీజ్ అయినా సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. వీరిద్దరి లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ మీద చాలా ట్రోలింగ్ జరిగింది. సో ఈ సినిమాతో వారెంటో ప్రూవ్ చేసుకోవాల్సిందే. మరి ఈ ఇద్దరు కొత్త డైరెక్టర్స్ తొలి సినిమాతో సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి

No comments:

Post a Comment