Breaking News

24/05/2019

ఫ్యాన్ సునామీలో కొట్టుకుపోయిన మంత్రులు

విజయవాడ, మే 23, (way2newstv.com)
సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి ఘోర పరాజయం ఎదురయ్యింది. 175 సీట్లకు గాను 151 వైసీపీ దక్కించుకుంది. టీడీపీ కేవలం 23 స్థానాల్లోనే గెలిచింది. ఈసారి మంత్రులకు ఓటర్లు గట్టి షాకే ఇచ్చారు. కేబినెట్‌లో పనిచేసిన 18మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. ముగ్గురే ముగ్గురు విజయం సాధించారు. ఇక స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా 
పనిచేసిన ఇద్దరు కూడా ఓడిపోయారు. 
ఓడిన మంత్రుల జాబితా: 
కిమిడి కళా వెంకట్రావు (ఎచ్చెర్ల) 
సుజయ కృష్ణ రంగారావు (బొబ్బిలి) 
చింతకాయల అయ్యన్న పాత్రుడు (నర్సీపట్నం) 



ఫ్యాన్ సునామీలో కొట్టుకుపోయిన మంత్రులు

కిడారి శ్రవణ్ కుమార్ (అరకు)
పితాని సత్యనారాయణ (ఆచంట) 
దేవినేని ఉమా మహేశ్వరరావు (మైలవరం) 
కొల్లు రవీంద్ర (మచిలీపట్నం) 
జవహర్ (తిరువూరు) 
ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరి పేట) 
నక్కా ఆనందబాబు (వేమూరు) 
శిద్దా రాఘవరావు (ఒంగోలు లోక్‌సభ) 
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (సర్వేపల్లి) 
పొంగూరు నారాయణ (నెల్లూరు సిటీ) 
అమర్నాథ్ రెడ్డి (పలమనేరు) 
నారా లోకేష్ (మంగళగిరి) 
కాల్వ శ్రీనివాసులు (రాయదుర్గం) 
భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ) 
ఆదినారాయణ రెడ్డి (కడప లోక్‌సభ) 
ఓడిన మంత్రుల్లో శిద్దా రాఘవరావు ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆదినారాయణ రెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ గీచేశారు. ఈ ఇద్దరు నేతలకు ఓటమి తప్పలేదు. 

No comments:

Post a Comment