Breaking News

02/04/2019

సౌతిండియాతో ఉన్నాననే కేరళ నుంచి పోటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2, (way2newstv.in)
మేథీ నుంచి కాకుండా కేరళలోని వయనాడ్ కూడా ఈసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలుసు కదా. దీనిపై వయనాడ్ ఎందుకు అన్న ప్రశ్నకు రాహుల్ సమాధానమిచ్చారు. నేను సౌతిండియాతోనే ఉన్నానని చెప్పడంతోపాటు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉందని చెప్పడమే తన ఉద్దేశమని రాహుల్ చెప్పారు. అక్కడి నుంచి పోటీ చేయాలని చాలా మంది అడిగారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని సౌతిండియా ప్రజలు భావిస్తున్నారు. 


సౌతిండియాతో ఉన్నాననే కేరళ నుంచి పోటీ

అందుకే నేను మీతో ఉన్నానని చెప్పదలచుకున్నాను అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. మోదీతో దక్షిణ భారతదేశానికి శత్రుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా రాహుల్ చెప్పడం విశేషం. తాను వయనాడ్ నుంచి పోటీ చేయడంపై లెఫ్ట్ అసంతృప్తిగా ఉందన్న వార్తలపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా వామ పక్షాలతో మాకు పొత్తు ఉంది. ఎక్కడా ఎలాంటి సమస్య లేదు. ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు అని రాహుల్ అన్నారు. అటు ప్రధాని మోదీ కూడా వయనాడ్ నుంచి రాహుల్ పోటీని ఎద్దేవా చేశారు. హిందువులంటే రాహుల్ భయపడుతున్నారని, అందుకే ముస్లింలు అధికంగా ఉన్న వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారని హేళన చేశారు.

No comments:

Post a Comment