Breaking News

02/04/2019

నిజామాబాద్ లో రెచ్చిపోయిన రౌడీ షీటర్లు

నిజామాబాద్, ఏప్రిల్ 2, (way2newstv.in)
నిజామాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై ఓ యువకుడ్ని చావబాదారు. చుట్టూ జనాలు అడ్డుకునే ప్రయత్నించినా.. వారిని కూడా బెదిరించి సీసీలతో మొహంపై కొట్టారు. తీవ్ర గాయాలైన బాధితుడ్ని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. యువకుడిపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ ఘటన రెండు రోజుల తర్వాత బయటకు వచ్చింది. నిజామాబాద్‌ సూపర్ మార్కెట్‌కు రాజు అనే యువకుడు వెళ్లాడు. 


నిజామాబాద్ లో రెచ్చిపోయిన రౌడీ షీటర్లు

అతడ్ని బయటకు లాక్కొచ్చిన రౌడీషీటర్లు శ్రీనివాస్, క్రాంతి కుమార్, సాయిలు కిందపడేసి విచక్షణారహితంగా దాడి చేశారు. కాళ్లతో తంతూ చావగొట్టారు.. సీసాలు తీసుకొని అతడ్ని చావబాదారు. ఓవైపు రక్తం కారుతున్నా.. తనను వదిలేయాలని యువకుడు బతిమాలినా వదల్లేదు. యువకుడిపై దాడి చేయడాన్ని గమనించిన స్థానికులు కొందరు అడ్డుకున్నారు. తీవ్రగాయాలైన బాధితుడ్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోడిగుడ్డు విషయంలో గొడవతోనే వివాదం జరిగిందని.. అందుకే యువకుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇటు బాధితుడు, కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. రౌడీషీటర్లు క్రాంతి, శ్రీనివాస్‌లు కొద్దిరోజులుగా గంజాయి, మద్యం మత్తులో స్థానికులపై దాడి చేస్తున్నారంటున్నారు.స్థానికులపై దాడి చేస్తుండటంతో బాధితుడు రాజు వారిని నిలదీశాడట. ఆ కక్షతోనే దాడి చేసినట్లు చెబుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్ని పట్టుకునే పనిలో ఉన్నారు.

No comments:

Post a Comment