Breaking News

01/04/2019

జయహో ఇస్రో

నెల్లూరు, ఏప్రిల్ 1, (way2newstv.in)
డీఆర్డీఓకి చెందిన ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 నానో ఉపగ్రహాలను సోమవారం ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రంలోని రెండో లాంచింగ్ ప్యాడ్ నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు ప్రారంభమై పీఎస్ఎల్వీ సీ45 రాకెట్ మూడున్నర గంటల తర్వాత నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను చేర్చింది. ఇందులోని 436 కిలోల బరువున్న ఇమిశాట్ శత్రువుల రాడార్లను గుర్తించడానికి తోడ్పడుతుంది. ప్రయోగం కేంద్రం నుంచి మొదలైన పీఎస్ఎల్వీ రాకెట్ 17 నిమిషాల అనంతరం 753.6 కిలోమీటర్ల ఎత్తు కక్ష్యలో ఇమిశాట్‌ను నిలిపింది. అక్కడ నుంచి 1.50 నిమిషాల్లో నాలుగు దశలను పూర్తిచేసిన పీఎస్ఎల్వీ లిథువేనియా, స్పేయిన్‌, స్విట్జర్లాండ్‌, అమెరికాకు చెందిన 28 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. కాగా, ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ రకం వాహక నౌక ప్రయోగం 47వది కాగా, ఎక్కువ సమయం ప్రయాణించిన రాకెట్ ప్రయోగాల్లో ఇది కూడా ఒకటి. గతేడాది జనవరిలో పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగానికి 2 గంటల 21 నిమిషాల సమయం పట్టింది. 


జయహో ఇస్రో

ఇక, తాజా ప్రయోగం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. పీఎస్ఎల్వీలో ఇంధనాన్ని మండించడానికి అధునాత బూస్టర్లను వినియోగించారు. మొత్తం నాలుగు దశల్లో ఒక్కో దశలో 12.2 టన్నుల బరువును మోసుకుపోయే సామర్థ్యంతో రూపొందించి, మూడు వేర్వేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. మొదటి పేలోడ్‌లోని ఆటోమెటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ సముద్ర జలాల్లోని నౌకల గురించి సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే రెండో పేలోడ్‌ ఆటోమేటిక్‌ ప్యాకెట్‌ రిపీటింగ్‌ సిస్టమ్‌లోని రేడియో అమెచ్యూర్‌ శాటిలైట్‌ కార్పొరేషన్‌ ప్రయోగాత్మకంగా అధునాతన సాంకేతికతకు సంబంధించి పరిశోధనలు నిర్వహించనుంది. ఇక మూడో పేలోడ్‌‌లో అమర్చిన అడ్వాన్స్‌డ్‌ రిటార్డింగ్‌ పొటెన్షియల్‌ అన్‌లైజర్‌ ఫర్‌ ఐనోస్పిరిక్‌ స్టడీస్‌ ద్వారా రాబోయే ఆరు నెలల్లో వాతావరణంలోని ఐనోస్పియర్‌పై పరిశోధనలు చేపడతారు. ప్రయోగం విజయవంతం చేసినందుకు ఇందులో భాగస్వామైన వారందరికీ ఇస్రో చైర్మన్ కే శివన్ శుభకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి రిశాట్, కార్టోశాట్ 3, చంద్రయాన్-2 సహా మరో 30 ప్రయోగాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం నింగిలోకి పంపిన ఉపగ్రహాలు తమ కక్ష్యలో చేరడంతో తమ ప్రాథమిక లక్ష్యాన్ని చేరుకున్నామని శివన్ సంతోషం వ్యక్తం చేశారు.మూడో దశలో 508 కిలోమీటర్ల ఎత్తున దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి రాకెట్ ప్రవేశించిన తర్వాత నాలుగో దశకు వెళ్ల సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. నాలుగో దశలో 485 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చేర్చే సమయంలో ఇంజిన్ రెండుసార్లు మొరాయించింది. దీంతో ఇంజిన్ రీ-స్టార్ట్ చేసి తక్షణమే లోపాన్ని సరిదిద్ది పేలోడ్‌ను విజయవంతంగా నాలుగు దశకు చేర్చారు.

No comments:

Post a Comment