Breaking News

14/02/2019

టీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలిచినంత మాత్రాన ప్రధాని కాగలరా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్ ఫిబ్రవరి 13 (way2newstv.in):
కేబినెట్ లేకపోవడంతో రాష్టంలో పాలన స్తంభించిపోయిందని, వందల కొద్దీ ఫైల్స్ పేరుకుపోతున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణలో అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలిచినంత మాత్రాన ప్రధానమంత్రి కాగలరా అని ఆయన ప్రశ్నించారు.. 


 టీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలిచినంత మాత్రాన ప్రధాని కాగలరా?

కేంద్రం అమలు చేస్తోన్న ఫసల్ భీమా పథకం ప్రవేశపెట్టనందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకుఎన్నికల ప్రచారానికి బీజేపీ సిద్ధమైందని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరిలోనే అన్ని రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటనలు ఉంటాయని చెప్పారు. అలాగే మార్చిలో అన్ని రాష్ట్రాల్లో మోదీ పర్యటనలు ఉంటాయని వెల్లడించారు. మన్ కీ బాత్-మోదీకే సాత్ అనే కార్యక్రమంలో భాగంగా పలు వర్గాల ప్రజల సలహాలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా మేరా పరివార్- బీజేపీ పరివార్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పారు. అలాగే కమల్ జ్యోతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని బీజేపీ ప్రభుత్వ లబ్ధిదారుల ఇళ్లలో దీపాలను వెలిగిస్తామన్నారు. దేశవ్యాప్త అసెంబ్లీ స్థానాల్లో వేలాది మందితో బైక్ ర్యాలీలు చేయబోతున్నామన్నారు.

No comments:

Post a Comment