Breaking News

13/08/2018

గుంటూరు జిల్లా పల్నాడులో హై టెన్షన్ వాతావరణం నెలకుంది

గుంటూరు, ఆగస్టు 13, (way2newstv.in)
మంగళగిరి టోల్ గేట్ వద్ద వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ను పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ మైనింగ్ పై నిజ నిర్ధారణ విచారణ కోసం  వైకాపా నేత బొత్స సత్యనారాయన గురజాల వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుగ్గిరాల పోలీసు స్టేషన్ కు తరలించారు. గుంటూరు  తూర్పు ఎమ్యెల్యే  ముస్తఫా,  అప్పిరెడ్డి,  కావేటి మనోహర్ నాయుడు లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోత్సా మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎన్నడూ చూడలేదు. గత 30 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. ఏపీ లో ప్రజాస్వామ్యం  పని చేయడం లేదు. ఏపీ లో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే బాధ వేస్తుంది. ఆనాడు దివంగత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మేము పని చేసాం. ఏనాడు మేము ఇలాంటి రాజకీయాలు చేయలేదన్నారు.



గుంటూరు జిల్లా పల్నాడులో హై టెన్షన్ వాతావరణం నెలకుంది

No comments:

Post a Comment