Breaking News

28/08/2018

ఆర్చరీ జట్టు విభాగంలో రజతం

న్యూఢిల్లీ, ఆగష్టు 28 (wewstv.in2nay)
భారత మహిళల ఆర్చరీ జట్టు కాంపౌండ్ విభాగంలో రజతం సాధించింది. మంగళవారం జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో 231-228 తేడాతో దక్షిణ కొరియా చేతిలో భారత జట్టు ఓటమిపాలైంది. ముస్కాన్ కిరార్, మధుమిత కుమారి, జ్యోతి సురేఖలతో కూడిన భారత మహిళల జట్టు అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో 225-222 తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది. ఫైనల్లో స్వర్ణం కోసం భారత్, కొరియా ఆర్చర్లు హోరాహోరీగా పోరాడారు. ఓ దశలో ఇరు జట్లు 173-173తో సమంగా నిలిచాయి. మూడో సెట్లో ఇరు జట్లు 58 పాయింట్లు సాధించాయి. కానీ నాలుగో సెట్లో భారత ఆర్చర్లు ఏకాగ్రత కోల్పోయారు. దీంతో కొరియా 58-55 తేడాతో ఆధిక్యం సంపాదించింది. 



ఆర్చరీ జట్టు విభాగంలో రజతం 

No comments:

Post a Comment