Breaking News

11/01/2020

ఈ ప్రభుత్వానికి మనుగడ వుండదు

విజయవాడ జనవరి 11, (way2newstv.in)
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. మహిళల పై దాడి చేసి,  అరెస్టు చేయడం అన్యాయమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరీ అన్నారు. శనివారం అయన మీడియతో మాట్లాడారు. తమ పార్టీ సిద్ధాంతం ఏదైనా.. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై తాను ఫైట్ చేస్తానని అయన అన్నారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయన్నారు. రాజధాని సమస్యను సరి చేయలేకపోతే తనకు పదవులు అనవసరమన్నారు. ఇవన్నీ చూస్తూ.. మౌనంగా ఉండలేనన్నారు. కేంద్రం కూడా పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందని తెలిపారు. ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఆడపడుచుల పట్ల విశ్వాసం కోల్పోయిందన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి భవిష్యత్తులో మనుగడ లేదన్నారు. అవసరం లేకున్నా 144 సెక్షన్ పెడుతున్నారని, ఏ నిబంధనల ప్రకారం అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వెళుతున్నారని ప్రశ్నించారు. 
ఈ ప్రభుత్వానికి మనుగడ వుండదు

ఒంగోలులో మహిళల పై మగ పోలీసులు దాడిచేయడం కలచి వేసింది. అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించుకోకుండా అడ్డుకున్నారని కులం వివరాల కోసం ఇబ్బందులు పెడతారా?, వైసీపీ ర్యాలీలకు ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారు. డీజీపీ కూడా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడ లేక సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇటువంటి వి ఆపలేకపోతే మనం పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు.  భిన్నాభిప్రాయాలు నుంచి ఏకాభిప్రాయం తీసుకురావాలి. పాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు. 13 జిల్లాల నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించాలన్నారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. అమరావతే రాజధానిగా ఉండేలా కృషి చేస్తానన్నారు. ఆరోజు అమరావతి ని రాజధానిగా వద్దని  జగన్ చెప్పలేదని అయన గుర్తు చేసారు. అధికారులు గుమ్మం ముందుకు వెళ్లి మరీ ఆరోజు స్థలం, పొలం అడిగారని అయన అన్నారు.  కుల, మతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేసి ఈ దారుణాలు ఆపాలని అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సిఎం అనేది గుర్తుంచుకోవాలి. కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. పాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యం కాదని అయన అన్నారు.

No comments:

Post a Comment