Breaking News

21/01/2020

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు చరిత్రాత్మక నిర్ణయం

అయినా బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకుంది
ఇదీ చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి
అందుకే మరోసారి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాం
సభలో ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్రెడ్డి
అమరావతి జనవరి 21 (way2newstv.in)
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నది ఒక చరిత్రాత్మక నిర్ణయమని, కానీ ఆ బిల్లును శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని, ఇది విపక్షనేత చంద్రబాబుతో పాటు, ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి అని ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అందుకే సభలో మంగళవారం మరోసారి ఆ బిల్లును ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయమని, అందుకే మంత్రి పదవుల్లో ఆరుగురిని నియమించామని, అయిదుగురు ఉప ముఖ్యమంత్రులలో ఇద్దరు ఆ వర్గాలకు చెందిన వారున్నారని తెలిపారు. అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు చరిత్రాత్మక నిర్ణయం

కానీ చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలను విడదీసి లబ్ధి పొందాలని చూశారని సీఎం ఆక్షేపించారు.ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం మరోసారి సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పలువురు సభ్యుల మాట్లాడిన అనంతరం, సీఎం మాట్లాడారు.టీడీపిది దిక్కుమాలిన చరిత్రఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసే చరిత్రాత్మక బిల్లును గతంలో శాసన మండలిలో ఆమోదం పొందకుండా చేసిన దిక్కుమాలిన చరిత్ర తెలుగు దేశం పార్టీది అని, ఇదీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, పార్టీ ఎమ్మెల్యేల వైఖరి అని సీఎం జగన్ పేర్కొన్నారు. దీంతో మరోసారి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టామని, ఈసారి మండలిలో అడ్డుకోవడం సాధ్యం కాదు కాబట్టి, సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ విధంగా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా విపక్షం వ్యవహరిస్తోందని తెలిపారు.మూడు కార్పొరేషన్లురాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. మాల, మాదిగతో పాటు, రెల్లి ఇతర కులాలకు వేర్వేరుగా మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ అదే ఎస్సీలను విడదీసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు కుట్ర చేశారని, వారిని విభజించి పాలించాలని దుర్భుధ్ధితో వ్యవహరించారని ఆక్షేపించారు. దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలు కలిసి ఉంటే, వారి డిమాండ్కు తలొగ్గాల్సి వస్తుందన్న దుర్భుద్ధితో వారిని విడగొట్టాలని చంద్రబాబు అడుగులు వేశారని పేర్కొన్నారు. దాన్ని సరిచేస్తూ, ఎస్సీలంతా ఒక్కటై ఉండాలన్న లక్ష్యంతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

No comments:

Post a Comment