Breaking News

23/12/2019

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ముంబై, డిసెంబర్ 23  (way2newstv.in)
పసిడి ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.80 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.36,370కు చేరింది.బంగారం ధర గత వారం రోజులుగా చూస్తే ఏకంగా ఆరు సార్లు పెరిగింది. కేవలం ఒక్క రోజు మాత్రమే తగ్గింది. దీంతో పసిడి పరుగు మళ్లీ క్రమంగా కొనసాగుతోందని అర్థం చేసుకోవచ్చు. పండుగ సీజన్ ముంగిట, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధర పెరగడం నిజం ప్రతికూల అంశమని చెప్పొచ్చుఅదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.80 పెరిగింది. దీంతో 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.39,670కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం అక్కడే స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.46,850 వద్దనే స్థిరంగా ఉంది.
 మళ్లీ పెరిగిన బంగారం ధరలు

అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.03 శాతం తగ్గుదలతో 1,481.65 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర మాత్రం 0.12 శాతం తగ్గుదలతో ఔన్స్‌‌కు 17.24 డాలర్లకు దిగొచ్చింది.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గతవారం నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1490 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 20 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయిప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య ఉద్రిక్తతలకు బ్రేకులు పడ్డాయి. ఇరు దేశాలు తొలి విడత ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. ఇకపోతే అదేసమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక ఫెడ్ రేటును యథాతథంగా కొనసాగించిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment