Breaking News

24/12/2019

కొనసాగుతున్న పసిడి పరుగులు

ముంబై, డిసెంబర్ 24 (way2newstv.in)
పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం కూడా బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మళ్లీ రూ.70 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.36,440కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 పెరుగుదలతో రూ.39,750కు ఎగసింది.బంగారం ధర గత 11 రోజుల్లో ఏకంగా రూ.580 మేర పరుగులు పెట్టింది. ఈ కాలంలో పసిడి రెండు సార్లు మాత్రమే తగ్గింది. ఇక అన్ని రోజులు పెరుగుతూనే వస్తోంది. డిసెంబర్ 11న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.35,910 వద్ద ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.39,170 వద్ద ఉంది. పండుగ సీజన్ ముంగిట, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధర పెరగడం నిజం ప్రతికూల అంశమని చెప్పొచ్చు.బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా స్వల్పంగా పైకి కదిలింది. 
 కొనసాగుతున్న పసిడి పరుగులు

కేజీ వెండి ధర కేవలం రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.46,860కు చేరింది. డిసెంబర్ 11న కేజీ వెండి ధర రూ.47,400 వద్ద ఉంది. అంటే ఇప్పుటితో పోలిస్తే వెండి ధర రూ.540 దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పసిడి ధర క్రమంగా పెరుగుతూ వస్తోందన్నారు.ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరుగుదలతో రూ.37,200కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 పెరుగుదలతో రూ.38,400కు ఎగసింది. కేజీ వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. రూ.10 పెరుగుదలతో రూ.46,860కు చేరింది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1,489.55 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర మాత్రం 0.09 శాతం తగ్గుదలతో ఔన్స్‌‌కు 17.50 డాలర్లకు దిగొచ్చింది.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోందిబంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో ఇటీవల నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1490 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 20 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంబంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment