Breaking News

29/11/2019

స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

విజయవాడ, నవంబర్ 29, (way2newstv.in)
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారులపై చిందులేశారు. ఓ అధికారిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.. స్పాట్‌లోనే కొడతా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. స్పీకర్‌ను ప్రభుత్వ ఉద్యోగులు శాంతపరిచేందుకు ప్రయత్నించినా వినలేదు.. ప్రోటోకాల్ పాటించరా అంటూ నిప్పులు చెరిగారు.స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం జ్యోతిరావు పూలే వర్థంతి కార్యక్రమం నిర్వహించారు.
 స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

కానీ ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించరా అంటూ మండిపడ్డారు. పూలే, అంబేద్కర్‌కు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపై ఇలాంటి తప్పు జరిగితే స్పాట్ లోనే కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.తమ్మినేని సీరియస్ కావడంతో అధికారులు సర్థిచెప్పేందుకు ప్రయత్నించగా.. స్పీకర్ శాంతించ లేదు.. అధికారులపై మరింత ఫైరయ్యారు. చుప్.. నోరు మూసుకోండి అంటూ హెచ్చరించారు. సమయం లేక సమాచారం ఇవ్వలేకపోయామని అధికారులు చెప్పే ప్రయత్నం చేయగా.. స్పీకర్ కోపాన్ని తగ్గించలేదు. దీంతో అధికారులు స్పీకర్ కోపం చూసి సైలెంట్ అయ్యారు.స్పీకర్ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. తమ్మినేని వ్యాఖ్యలపై రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా అధికారుల్ని కొడతా అనడం ఇప్పుడు హాట్‌‌‌టాపిక్‌గా మారింది. మరి ఈ వీడియోపై ఆయన ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

No comments:

Post a Comment