Breaking News

21/08/2019

కుప్పకూలిన వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న హెలికాఫ్టర్‌ ముగ్గురు వ్యక్తుల దుర్మరణం

హరిద్వార్‌ ఆగష్టు 21  (way2newstv.in - Swamy Naidu)
వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ హెలికాఫ్టర్‌ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాద సమయంలో చాపర్‌లో ఉన్న పైలట్‌ రాజ్‌పాల్‌, కో పైలట్‌ కప్తల్‌ లాల్‌, రమేష్‌ సవార్‌ అనే స్ధానికుడు మరణించారని అధికారులు వెల్లడించారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాల్లో నిర్వాసితులకు సహాయ సామాగ్రిని ఈ హెలికాఫ్టర్‌లో తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరకాశీ సమీపంలోని మోల్ది గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. 
 కుప్పకూలిన వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న హెలికాఫ్టర్‌
ముగ్గురు వ్యక్తుల దుర్మరణం 
హెలికాఫ్టర్‌కు వైర్‌ తగలడంతో చాపర్‌ కూలిందని అరాకోట్‌ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీ వరద ముంచెత్తడంతో మిగతా ప్రపంచానికి ఈ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. కాగా హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ రూ 15 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

No comments:

Post a Comment