అమరావతి ఆగష్టు 19 (way2newstv.in - Swamy Naidu)
ఆంధ్రప్రదేశ్ లో మరో పథకం పేరు మారింది. టీడీపీ హయాంలో ప్రారంభించిన 'చంద్రన్న పెళ్లి కానుక' పథకం పేరును 'వైయస్సార్ పెళ్లి కానుక'గా మార్చారు. ఈ మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
వైయస్సార్ పెళ్లి కానుక’గా ‘చంద్రన్న పెళ్లి కానుక' పేరు మార్పు
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్లను సీఎం జగన్ మారుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం పేరును వైయస్సార్ అక్షయపాత్రగా, ఎన్టీఆర్ భరోసా పథకాన్ని వైయస్సార్ పింఛను కానుకగా మార్చారు.
No comments:
Post a Comment