విశాఖపట్నం, ఆగష్టు 06 (way2newstv.in - Swamy Naidu )
విశాఖపట్నం సింహాచలంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. తొలిపావంచా సమీపంలో తన కుమారుడు అపహరణకు గురయ్యాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుకుంపేట మండలం గుండువిల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. పాడేరుకు చెందిన శేఖర్ అనే వ్యక్తితో ఈమెకు ఇటీవల పరిచయం ఏర్పడింది.
సింహాచలంలో బాలుడి కిడ్నాప్
విశాఖపట్నం సింహాచలంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. తొలిపావంచా సమీపంలో తన కుమారుడు అపహరణకు గురయ్యాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుకుంపేట మండలం గుండువిల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. పాడేరుకు చెందిన శేఖర్ అనే వ్యక్తితో ఈమెకు ఇటీవల పరిచయం ఏర్పడింది. ఆదివారం రాత్రి అతడికి ఫోన్ చేసి మర్నాడు సింహాచలం దర్శనానికి వెళ్తున్నట్లు చెప్పింది. సోమవారం హుకుంపేట నుంచి రెండేళ్ల కుమారుడితో కలిసి ఆమె విశాఖ ద్వారకా బస్స్టేషన్కు వచ్చింది. శేఖర్ వీళ్లిద్దరిని ఆటోలో సింహాచలం తీసుకువచ్చాడు. మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశాక కుమారుడు, లగేజీని శేఖర్కు అప్పగించింది.అయితే కొంతసమయం తర్వాత వీరు కనిపించకపోవడంతో గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించింది. సమీప దుకాణాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆదివారం రాత్రి అతడికి ఫోన్ చేసి మర్నాడు సింహాచలం దర్శనానికి వెళ్తున్నట్లు చెప్పింది. సోమవారం హుకుంపేట నుంచి రెండేళ్ల కుమారుడితో కలిసి ఆమె విశాఖ ద్వారకా బస్స్టేషన్కు వచ్చింది. శేఖర్ వీళ్లిద్దరిని ఆటోలో సింహాచలం తీసుకువచ్చాడు. మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశాక కుమారుడు, లగేజీని శేఖర్కు అప్పగించింది.అయితే కొంతసమయం తర్వాత వీరు కనిపించకపోవడంతో గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించింది. సమీప దుకాణాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
No comments:
Post a Comment